ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలోని పరిశవారిపాలెం (దిండి) వద్ద రూ. 88.08 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కు పనులకు ప్రభుత్వం గురువారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ. 52.85 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 35.23 కోట్లు చొప్పున భరిస్తాయి. ఇందులో రూ. 25.79 కోట్లతో చేపల విభాగం, రూ. 18.58 కోట్లతో రొయ్యల విభాగం, రూ. 13.78 కోట్లతో సీఫుడ్‌ పార్కు, రూ. 9.88 కోట్లతో పీతల విభాగం, రూ. 6.72 కోట్లతో సీ వీడ్‌ పార్కు, రూ. 7.23 కోట్లతో ఆర్నమెంటల్‌ ఫిష్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేస్తారు.