క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ కింద సన్నరకం వడ్లు విక్రయించిన రైతులకు మరో రూ.500 కోట్లను పౌరసరఫరాల శాఖ సోమవారం విడుదల చేసింది. వీటిని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటనలో తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు రైతులకు విడుదల చేసిన బోనస్‌ రూ.1,425.91 కోట్లకు చేరింది.