పత్తి కొనుగోళ్ళ ఏర్పాట్లపై సచివాలయంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు మరియు అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
మార్కెట్కు మరియు జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని, వాట్స్ యాప్ సేవల (8897281111) ద్వారా వెయిటింగ్ టైమ్, పేమెంట్ స్టేటస్, కంప్లయింట్ ఫోరం, ఇతర సేవలను రైతులు వినియోగించుకోవాలని, జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని, అకాల వర్షాలు వస్తున్నందున మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు, సిసిఐ అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతు తీసుకువచ్చిన పంటలు తడవకుండా కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలని, పత్తి కొనుగోళ్ళ విషయములో అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో జరిగిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు, అధికారులతో సమీక్షలో తెలిపారు.

