పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ రంగ పని తీరు సూచికల్లో 89 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ 82, కృష్ణా 80, శ్రీసత్యసాయి 80, నంద్యాల 78 స్కోర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘ఏ’ గ్రేడ్‌లో 7 జిల్లాలు, ‘బి’ గ్రేడ్‌ 19 జిల్లాలు ఉన్నాయి. అన్నమయ్య 53, చిత్తూరు 59, శ్రీకాకుళం 61 స్కోర్లకు పరిమితమై అట్టడుగున నిలిచాయి.

ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. గతేడాదితో పోలిస్తే సగటున 23.59% అధిక ఉత్పత్తి లభిస్తుందని అంచనా. దూది (పత్తి) ఉత్పత్తి కూడా గతేడాది కంటే 30.97% పెరుగుతుందని పేర్కొ న్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అధిక ఉత్పత్తి లభించనుంది. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రకాశం, పల్నాడు జిల్లాలు తొలి స్థానాల్లో నిలిచాయి.