ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించండి

గిడ్డంగుల సంస్థకు మంత్రి తుమ్మల ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో కొత్త గోదాములను నిర్మించాలని, ఆహార ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు పెంచాలని గిడ్డంగుల సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థపై సమీక్ష నిర్వహించారు. సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్రా లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ”ఈ ఏడాది కొత్తగా 30,000 టన్నుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. మరో 1,03,800 టన్నుల నిల్వ సామర్థ్యంతో 8 ప్రాంతాల్లో కొత్త గిడ్డంగుల నిర్మాణం చేపట్టాం. గోదాముల్లో సరకుల నిల్వ, రవాణా, వాహనాల రాకపోకలపై నిఘా ఏర్పాట్లు ప్రారంభించాం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాని సందర్భంలో అన్నదాతలు గోదాముల్లో సరకులను నిల్వ చేసుకోవాలి. సన్న, చిన్నకారు రైతులు ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేస్తే వారికి 35 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన సరకు ద్వారా బ్యాంకులను నుంచి రుణాలు సైతం పొందవచ్చు” అని మంత్రి తెలిపారు.

Read More

ధాన్యం ఎప్పుడు అమ్మాలో రైతులే నిర్ణయించుకునే వెసులుబాటు

రైతులు ధాన్యాన్ని ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకొనేలా మొబైల్‌ ద్వారా కూపన్‌ సృష్టించుకునే ఏర్పాటును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ధాన్యం అమ్మకంలో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలనూ సులభతరం చేస్తున్నామని పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ఫార్మింగ్‌ విధానంలో భాగంగా ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్‌ సేవల పైనా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు.
వాట్సప్‌లోనే కూపన్‌
మొబైల్‌ ద్వారా కూపన్‌ తయారు చేసేందుకు పౌరసరఫరాలశాఖ 7337359375 అనే వాట్సప్‌ నంబరును కేటాయించింది.

  • ఈ నంబరుకు హాయ్‌ అని సందేశం పంపిస్తే.. ‘పౌరసరఫరాల సంస్థకు సుస్వాగతం.. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్‌ బుక్‌ చేసుకోండి’ అని వస్తుంది. షెడ్యూల్‌ ఎంపిక చేసుకున్నాక… ఆధార్‌ నంబరును నమోదు చేయాలి.
  • రైతు పేరును ధృవీకరించాక.. కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవాలి. అమ్మాల్సిన తేదీకి మూడు ఆప్షన్లు ఇస్తారు. అందులో ఒక తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. ధాన్యం రకం, ఎన్ని బస్తాలో తెలియజేయాలి. తర్వాత ధాన్యం అమ్మకానికి స్లాట్‌ బుక్‌ అయినట్లు మొబైల్‌ ఫోన్‌కు సందేశం వస్తుంది.
Read More