తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి, ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్‌ టైటిల్‌ అమలు, అధికారలకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు, భూ వినియోగపాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూధార్‌ కార్డుల అందజేత వంటి పలు సిఫార్సులతో ధరణి కమిటీ ముసాయిదా నివేదికను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది.