‘వండని వంటలు’ ఓ అద్భుతం‘వంద వండని వంటలు’ పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించి… రచయిత, సంకలన కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని అభినందించారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినేవిధంగా పలువురు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న ‘రైతునేస్తం’ వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ డా॥ యడ్లపల్లి వేంకటేశ్వర రావు, రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777 కు సంప్రదించండి.

Read More

‘పల్లె పలుకు బతకాలి’పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స్’ ప్రచురించిన ‘పల్లె పలుకు’ (పాత గుంటూరు మాండలికము) పుస్తకాన్ని భారత పూర్వ ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘పల్లె పలుకు’ను మరచిపోతున్న ఈ రోజుల్లో, ఆ పలుకును భావితరాలకు అందించటం కోసం ‘రైతునేస్తం’ వేంకటేశ్వరరావు వ్యయ ప్రయాసలకోర్చి తీసుకురావటం అభినందించదగ్గ విషయమన్నారు. రచయిత కోన రమణారావు 85 సంవత్సరాల వయస్సులో పాత గుంటూరు మాండలికాల పదాలను సేకరించటంతో పాటు వారే కోడి పుంజు, ఎడ్ల బండి, వ్యవసాయ పనులతో గీసిన ముఖచిత్రం నాకెంతో ఆనందం కలిగించింది. ఈ పుస్తకం మన భాషను కాపాడుకునే దిశగా ఓ చక్కని ప్రయత్నమన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం పేరుకు పాత గుంటూరు కానీ దీనిలోని పలుకు అంతా ప్రతి పల్లె పలికే పలుకే. ఆ పదాలు చదువుతుంటే పల్లె వాతావరణాన్ని ఒక్కసారిగా మనల్ని ఆవహిస్తుందనీ, ఎవరినైనా తట్టిలేపే శక్తి ఆ పదాలకు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ ‘రైతునేస్తం’ వేంకటేశ్వరరావు, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, ప్రముఖ కథకులు, మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ఆకాశవాణిలో పనిచేసిన వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

రైతునేస్తం పబ్లికేషన్స్’ ప్రచురించిన ‘పల్లె పలుకు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… ఉల్లిగడ్డ పచ్చడి

చాలా సింపుల్ వంటకం.

ఉల్లిగడ్డ కారం లేదా ఉల్లిగడ్డ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిపాయ (వెల్లుల్లి). కొంచెం జీలకర్ర, ఎండుకారంతో చేస్తే, ఇది ఉల్లిగడ్డ కారం అయితది.

ముందుగా ఉల్లిగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా కోసి, అందులో పొట్టు తీసిన ఎల్లిపాయలను వేసి, తగినంత కారం, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఎండు కారానికి బదులుగా, పచ్చిమిర్చి కూడా వాడవచ్చు. అవసరమైన వారు పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోయినా రుచికరంగానే ఉంటుంది.
ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, ఏది తినాలని అనిపియ్యనప్పుడు, ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటది. ఇంట్లో కూరగాయ లేనప్పుడు, రెండు నిమిషాల్లో అయిపోతుంది. పచ్చి నూనె కలుపుకొని తిన్నా బాగుంటుంది.
ఈ కారాన్ని పేలాలలో, సలాడ్లలో, అన్నంలో, రొట్టెల్లో, దేంట్లో అయినా కలిపి తినొచ్చు. అన్నిటిలోకి కలిసిపోతుంది.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… అల్లం కారం

అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…

మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.

జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.

ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.

రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More