గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపార వేత్త బాబూభాయ్‌ జిరావాలా (ఛాద్వాడియా).. తన తల్లి వర్ధంతి సందర్భంగా 290 మంది రైతుల అప్పులను తీర్చారు. మొత్తం రూ. 89,89,209 ను ఆయన రైతులకు అందజేశారు. ఈ రుణ సమస్య అమ్రేలీ జిల్లాలోని జిరా గ్రామస్థులను 1995 నుంచీ వేధిస్తోంది. 290 మంది రైతులు ఎంత రుణం తీర్చినా ఇంకా మిగిలిపోతోంది. దీనికి శాశ్వత పరిష్కారంగా బాబూ భాయ్‌.. రుణాన్ని తీర్చాలని నిర్ణయించి తీర్చేశారు.