ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల్లో దాన్ని చేర్చాలని అగ్రి వర్సిటీల డీన్‌ల జాతీయ సదస్సు తీర్మానించింది. హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో డీన్‌ల సదస్సు జరిగింది. వ్యవసాయ విద్యా విధానాలు, సవాళ్లు, పురోగమనం అంశాలపై ఇందులో చర్చించారు. 45 రాష్ట్ర, కేంద్ర, డీమ్డ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన 56 మంది డీన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. నార్మ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌సీ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.