జిల్లా కేంద్రాల్లోని మార్కెట్ల ఆధునికీకరణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని మార్కెట్లను ఆధునికీకరించడంతోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లను మరింత అభివృద్ధి చేసేందుకు నివేదికలు సిద్ధం చేశామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని కొహెడ వద్ద అత్యాధునిక మెగా మార్కెట్ను నిర్మిస్తామని.. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఔటర్, రీజినల్ రింగు రోడ్డు మధ్యలో 400 ఎకరాల్లో కొహెడ వద్ద విస్తృతమైన మార్కెట్నుతత నిర్మించనున్నట్లు వివరించారు.

