పొగాకు ‘ధర’ కిలోకు రూ.418
వర్జీనియా పొగాకు ధరలు నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. గురువారం అమ్మకాలు ముగిసే సమయానికి కిలో ధర రూ.395కు చేరింది. శుక్రవారం వేలంలో రూ. 23 పెరిగి రూ.418తో రికార్డు ధర లభ్యమైంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రం, కొయ్యలగూడెం కేంద్రాల్లో శుక్రవారం జరిగిన వేలంలో కిలోకు రూ.418 ధర నమోదైంది. ఈ పొగాకు ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. గత సీజన్లో కిలోకు రూ.411తో మార్కెట్ ముగిసింది. మేలు రకం పొగాకుకు మంచి ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి ఎన్ఎల్ఎస్లోని ఐదు వేలం కేంద్రాల్లో 58.25 మిలియన్ కిలోల కొనుగోళ్లు జరిగాయి.

