లక్ష ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు లక్ష్యం
- మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం ఉరవకొండలో సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు.

