రైతులు, కూలీల అనుసంధానించడానికి ఫోన్ నెం.

రైతులను, కూలీలను సులువుగా అనుసంధానించడానికి వినూత్న పరిష్కారం చూపించారు కడియాల ధనేష్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన ధనేష్ వాట్సప్ బ్లూ కనెక్ట్ పేరుతో చాట్ బాట్‌ను రూపొందించారు. దీనిని ఉపయోగించాలంటే ముందుగా 6281685487 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సప్ చాట్ నంబర్ ఓపెన్ చేయగానే బ్లూ కనెక్ట్ చాట్‌బాట్ ఆహ్వానం పలుకుతుంది. హాయ్ అని పెట్టగానే పని ఇవ్వాలనుకుంటున్నారా (రైతు) లేదా పని కోరుతున్నారా (కార్మికుడు) అని అడుగుతుంది. ఎంపికకు అనుగుణంగా తెలుగులోనే ప్రశ్నలు వరుసగా వస్తాయి. వాటికి సమాధానాలు ఇస్తే మనకు కావాల్సిన వారితో అనుసంధానం చేస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా రైతులు తమకు పది కి.మీ. పరిధిలో పనులకు అందుబాటులో ఉన్న కూలీలను సంప్రదించవచ్ౘ్ు. ఈ చాట్‌బాట్‌లోనే వాతావరణ, ప్రభుత్వ పథకాల సమాచారమూ అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యమని ధనేష్ తెలిపారు.

త్వరలోనే మరిన్ని గ్రామాలకు బ్లూ కనెక్ట్ రూపకర్త ధనేష్ 2023లో మెకానికల్ సబ్ౙెక్ట్‌లో బీటెక్ పూర్తిచేశారు. అప్పటి నుంచి చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి కొంత నగదు కూడబెట్టారు. ప్రస్తుతం ఆ నగదుతోనే ఇలాంటి వాట్సప్ చాట్‌బాట్‌లు రూపొందిస్తున్నారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్-2026లో సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో బ్లూ కనెక్ట్ ప్రాజెక్టుకు అవార్డునూ అందుకున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ చాట్‌బాట్‌ను భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు విస్తరించాలనేది తన లక్ష్యమని ధనేష్ చెప్పారు.

Read More

నిరుద్యోగులకు వ్యవసాయ, అనుబంధ రకాలు దన్నుగా నిలిచాయి

తెలంగాణా రాష్ట్రంలో గత మూడు నెలల్లో నిరుద్యోగ రేటు 6.9 నుంచి 5.7 శాతానికి తగ్గింది.. తయారీ, సేవారంగాల్లో ఉపాధి స్వల్పంగా నెమ్మదించినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలు దన్నుగా నిలిచినట్లు కార్మిక బలగం సర్వే (జులై-సెప్టెంబరు, 2025) నివేదిక వెల్లడించింది. గత మూడు నెలల్లోనే ఈ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇదే సమయంలో 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగం స్థిరంగా 20.2 శాతంగా (యువతుల్లో 21.7%, యువకుల్లో 19.5%) నమోదైనట్లు వెల్లడించింది. గ్రామీణ యువతలో నిరుద్యోగం 18.0 శాతం ఉంటే.. పట్టణాల్లో 22.7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు తక్కువ ఉంటే.. పట్టణ మహిళల్లో ఎక్కువగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలివి..
రాష్ట్రంలో వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతున్నవారు జూన్‌ నాటికి 32.9% మంది ఉంటే.. ప్రస్తుతం 40.5% ఉన్నారు. వర్షాలు పడటం, సాగు విస్తీర్ణం పెరగడంతో మూడు నెలల్లో ఈ రంగంపై ఆధారపడిన గ్రామీణుల శాతం 50.1 (ఏప్రిల్లో) నుంచి 60.1కి (సెప్టెంబరు నాటికి) చేరింది.
పట్టణాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కార్మికుల వాటా మూడు నెలల క్రితం 4.1% ఉంటే.. ఇటీవల 6.2 శాతానికి చేరింది.
రాష్ట్రంలో తయారీ, క్వారీ, మైనింగ్‌ రంగాల్లో ఉపాధి తగ్గింది. జూన్‌ నాటికి ఈ రంగాల్లో 29.1% ఉంటే.. సెప్టెంబరు నాటికి 22.2 శాతానికి పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సేవారంగంలోనూ స్వల్పంగా 38 నుంచి 37.3 శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని సేవా రంగాల్లో ఉపాధి రేటు 20.8 నుంచి 21.3 శాతానికి పెరిగింది.
జాతీయ స్థాయిలో పరిశీలిస్తే స్వయంఉపాధి పొందుతున్నవారి సంఖ్య పెరిగింది. జూన్‌ నాటికి 39% మంది స్వయంఉపాధి పొందుతుండగా.. సెప్టెంబరు నాటికి అది 40.6 శాతానికి చేరింది. పురుషుల్లో 41.3 నుంచి 43.2 శాతానికి పెరిగింది.

Read More