అకాలవర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన విశ్వ విద్యాలయం ఉపకులపతి దండా రాజిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూరగాయలు, పండ్లతోటలు, పసుపు తదితర పంటలపై అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని 24 గంటల్లోపు బయటకు పంపాలని, టమాటాలకు పగుళ్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

