కూరగాయపంటలకు తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉంటుంది

కూరగాయ పంటలకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటోందని.. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. వాటి నివారణకు కృషి చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధన కేంద్రంలో ‘అఖిల భారత సమన్వయ పథకం’ 44వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, ఐకార్ ఏడీజీ సుధాకర్ పాండే, వారణాసి భారతీయ కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్‌కుమార్, బెంగళూరులోని ఐఐహెచఆర్ డైరెక్టర్ టీకే బెహరా, ఎన్‌బీపీజీఆర్ డైరెక్టర్ జీపీ సింగ్, ఎనఐఆర్‌సీఏ డైరెక్టర్ శేషు మాధవ్, మాజీ వీసీ లావాండే, ఇతర శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.

Read More

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి చేపట్టబోయే వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగింపు — రిజిస్ట్రార్ డాక్టర్. జి .ఈ .సిహెచ్. విద్యాసాగర్.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోయే వ్యవసాయ, వెటర్నరీ మరియు ఉద్యాన వర్సిటీల డిగ్రీ కోర్సులలో 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి ఈ సి హెచ్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున, ఆయా కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు వివరాల కొరకు వర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించాలని సూచించారు.

Read More