ఉద్యాన పంటల అభివృద్ధికి మారుత్ డ్రోన్స్తో హార్టికల్చర్ వర్సిటీ ఒప్పందం
ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధన, శిక్షణకు అవసరమయ్యే సహకారం కోసం హైదరాబాద్కు చెందిన మారుత్ డ్రోన్స్ సంస్థతో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ విశ్వవిద్యాలయం గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ దండా రాజి రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ భగవాన్, మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమకుమార్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. డ్రోన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తెగుళ్లను అంచనా వేస్తూ పంటల సాగు పద్ధతులను మెరుగుపరుస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు చీనానాయక్, లక్ష్మీనారాయణ, సురేష్కుమార్, శ్రీనివాసన్, వీణ జోషి తదితరులు పాల్గొన్నారు.

