అధిక దిగుబడి, గింజ నాణ్యతకు సప్తధాన్యాంకుర ద్రావణం
సప్తధాన్యాలను పాత్రలో వేసి నానిన తర్వాత మొలక కట్టాలి (విడివిడిగా).
- 100 గ్రా. పెసలు (మొలకలు)
- 100 గ్రా. మినుములు (మొలకలు)
- 100 గ్రా. అలసందలు (మొలకలు)
- 100 గ్రా. శనగలు (మొలకలు)
- 100 గ్రా. నువ్వులు (మొలకలు)
- 100 గ్రా. ఉలవలు (మొలకలు)
- 100 గ్రా. గోధుమలు (మొలకలు)
తడిగుడ్డతో వేలాడకట్టి మొలక వచ్చాక అన్ని కలిపి రుబ్బి ఒక లీ. నీరు కలపాలి. 10 లీ. ఆవు మూత్రం కలపాలి. కర్రతో బాగా కలియ త్రిప్పాలి. 2 గంటలు అలాగే ఉంచితే ఘనపదార్థం అడుగుకి చేరుతుంది. ఆ కషాయం వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది 48 గంటలు నిలువ ఉంటుంది. పైరు పాలు పోసుకునేటప్పుడు అన్ని పంటలకు పిచికారి చేస్తే దిగుబడి, గింజ నాణ్యత పెరుగుతుంది.




