ఆందోళనలో గోకులాల రైతులు
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది 25 వేల గోకులాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. సొంత స్థలం ఉన్నా గోకులాలు నిర్మించుకునే స్థోమత లేని వారికి రూ.1.18 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14 వేల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. దశలవారీగా వీటికి బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. మిగిలిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న ఆప్షనన్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తొలగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పేద రైతులను దృష్టిలో పెట్టుకుని బిల్లులు ఉపాధి హామీ పోర్టల్ అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రెండు రోజుల క్రితం లేఖ రాసింది.

