ఆయిల్ పామ్ సాగుపై సమీక్ష
తెలంగాణా వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోద్రేజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు రిఫైనరీ ఏర్పాటుపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో TGICC డైరెక్టర్, ఆయిల్ఫెడ్ ఎండి, మార్క్ఫెడ్ ఎండి మరియు డిపార్ట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఆయిల్ పామ్ యూనిట్ల ప్రస్తుత పరిస్థితి, ప్రాసెసింగ్ సామర్థ్యం, మరియు రాబోయే రోజుల్లో ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ మరియు ప్రాసెసింగ్ యూనిట్ల మెరుగుదలపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.










