తక్షణం మరమ్మతులు చేయకపోతే జలాశయం భద్రతకే ముప్పు అని నివేదికలు అందడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమలో లక్షల ఎకరాలకు ఆధారమైన గోరకల్లు జలాశయాన్ని బాగు చేసేలా నిధులు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.617 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ డ్యాంను ముప్పు నుంచి బయటపడేసేందుకు తాజాగా రూ.53 కోట్లు మంజూరు చేయడం జరిగింది. జలవనరులశాఖ అధికారుల నుంచి మొత్తం రూ.122 కోట్లతో అవసరమైన పనులు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకు నిధులు కేటాయించలేదు. డ్రిప్‌ కింద ప్రతిపాదనలు పెట్టినా ఆ పథకం చేపట్టేందుకు అనుమతి లభించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మంత్రిమండలి ముందు ప్రత్యేకంగా ప్రతిపాదన ఉంచి జలవనరులశాఖ నిధులు తెచ్చుకుంది.