భారతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల నిపుణులు

    వరిలో మరిన్ని నూతన వంగడాలను రూపొందించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని నిపుణులు సూచించారు. భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్‌), అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)లు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం సోమవారం రాజేంద్రనగర్‌లో ప్రారంభమైంది. ఐఐఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ మీనాక్షి సుందరం అధ్యక్షత వహించగా జాతీయ, అంతర్జాతీయ నిపుణులు వాసిం హుస్సేన్‌, మహేందర్‌, ముత్తురామన్‌, జ్యోతి, కల్యాణి, నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్లాంట్‌ బ్రీడింగ్‌లో సరికొత్త డేటా అనాలసిస్‌ పద్ధతులను వినియోగించి నూతన వంగడాలను రూపొందించాలన్నారు