నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి – కావేరి లింక్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు జలాశయాలు నిర్మించాలనే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్తగా నిర్మించే జలాశయాల వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే భరించాలని, ఈ ప్రాజెక్టు వలన 4.50 లక్షల ఎకరాలకు నీరు అందివ్వడానికి వీలు కుదురుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.