కృష్ణానది ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్‌ జలాశయాలకు వరద కొనసాగుతోంది. వాటి నుంచి అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 580 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 512.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టి.ఎం.సి.లు కాగా ప్రస్తుతం 135.78 టిఎంసీలు నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో మూడు గేట్లను ఎత్తిన కర్నూలు చీఫ్‌ ఇంజనీర్‌ కబీర్‌ భాషా ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. 6,7,8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తం 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. దీంతో కృష్ణానది పరవళ్ళు తొక్కుతోంది.