కర్ణాటక పరిధిలో కృష్ణానది ఉప్పొంగుతుంది. అక్కడి ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలు వరద నీటితో తొణికిసలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజక్ట్‌ నుంచి 2,50,783 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 7,286 క్యూసెక్కుల వరద వస్తోంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 45,236 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంకాలానికి 109.0060 టి.ఎం.సీలుగా నీటి నిల్వ నమోదయ్యింది. నాగార్జున సాగర్‌కి నీటి ప్రవాహం మొదలయ్యింది.