తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూములకు సంబంధించిన సమస్యలు నానాటికి ఎక్కువవుతుండడముతో సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉందన్నారు. భూదాన్‌, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూములున్న ఒక మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించినట్లయితే ఇలాంటి సమస్యలన్నింటిపై పూర్తి స్పష్టత ఏర్పడి తుది నిర్ణయం తీసుకుంటానికి అవకాశం కుదురుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.