కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో ప్రత్తికి గరిష్ఠంగా రూ. 7200/-లు ధర పలికింది. వర్షం కారణంగా కేవలం ఒక ట్రాలీ విడి పత్తిని మాత్రమే రైతులు మార్కెట్‌కి తీసుకొచ్చారు. అయినాకాని సోమవారం కంటే రూ. 60/-లు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతో పత్తి ధర తగ్గిందని వ్యాపారులు తెలిపారు. పత్తి బిడ్డింగ్‌ను మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి జి. రెడ్డినాయక్‌ పరిశీలించారు.