యాజమాన్య పద్ధతులు

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన కుందేళ్ళ పెంపకం, ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో అడుగిడుతుంది. ప్రారంభ థలో కుందేళ్ళ పెంపకం అలంకార ప్రాయంగా కొందరు పెంచుకోగా, ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక స్థాయి అనుసరించి ప్రజలు విలువ కలిగిన ఆహార ఉత్పత్తులవైపు ఖర్చు చేయుటకు మొగ్గు చూపుతున్నారు. అధిక పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందించే కుందేళ్ల పెంపకంకు రాబోయే రోజుల్లో మరింత డిమాండ్‌ పెరిగే అవకాశముంది. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొరకు చాలామంది పెంచుటచే ఈ పరిశ్రమ లాభసాటి పరిశ్రమ అయి వాటి నుండి తయారైన వస్తువులను ఎగుమతి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా రూపొందుతుంది. మన రాష్ట్రంలో కుందేళ్ళ మాంసానికి మంచి గిరాకి ఉన్నది. కాబట్టి తక్కువ ఖర్చులో కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టి మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. కుందేళ్ల పెంపకాన్ని చేపట్టేవారు ముందుగా ఏ ప్రాంతములో మాంసానికి గిరాకి ఎక్కువ ఉందో తెలుసుకుని ఆ ఆప్రాంతంలో కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టడం మంచిది.

కుందేళ్ళ పెంపకంతో లాభాలు

దీ కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, ఆసక్తిగలవారెవరైనా కూడా కుందేళ్లు పెంపకాన్ని చేపట్టవచ్చు.

దీ కుందేళ్ళ పెంపకానికి అవసరమైన స్థలం చాలా తక్కువ.

దీ ఇవి ప్రకృతికి ఎటువంటి నష్టాన్ని కలిగించవు.

దీ ఈ కుందేళ్లు సాధు స్వభావం కలిగినవి. ఇంటిలోని మనుషులు సులభంగా కుందేళ్ల పెంపకంలో పాల్గొనవచ్చు. కాబట్టి అదనపు కూలీ ఖర్చులు అవసరం ఉండదు.

దీ కుందేళ్లు వంట ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటిపై ఆధారపడి జీవిస్తాయి. కావున వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.

దీ ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను ఇవి సమర్ధవంతంగా వినియోగించుకోగలవు. కావున ఇది రైతులకు వరం లాంటిది.

దీ కుందేళ్లలో వ్యాధులకు గురికావడం తక్కువగా ఉండడం చేత మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్లకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే అవసరం కూడా ఉండదు.

దీ కుందేళ్లు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మాంసంగా మార్చుకోగలవు. కోళ్ల తర్వాత కుందేళ్లకు ఈ సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్ల మాంసంలో 22 శాతం వరకు మాంసకృత్తులు ఉండడం మరియు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు ఈ మాంసాన్ని స్వీకరించవచ్చు. 

దీ ఒక కిలో ఉన్ని ఉత్పత్తికి అంగోరా జాతి కుందేళ్లు తీసుకునే ఆహారం గొర్రెల కంటే చాలా తక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్ల పేడలో అధిక పాళ్లలో నత్రజని, భాస్వరం ఉండటం వల్ల పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా వాడవచ్చును.

దీ కోళ్ళ పరిశ్రమలో దాణా ఖర్చు ఎక్కువగా అవుట చేత, అది అంత లాభసాటిగా లేదు. కాని కుందేళ్లు ఎక్కువగా గడ్డిపైన ఆధారపడి యుండుట చేత దీనిపై ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయమును రైతు సోదరులు గమనించగలరు.

దీ మన రాష్ట్రంలోని రాజేంద్రనగర్‌ మరియు కోరుట్ల వెటర్నరి కళాశాల యందు కుందేళ్లను చాలా రోజుల నుండి పెంచుతున్నారు. కావున ఈ కేంద్రముల నుండి ఆసక్తి గల రైతులు కుందేళ్లను పొందవచ్చును.

మన దేశంలో కుందేళ్ల జాతులు

దీ మన దేశంలో కుందేళ్లను రెండు రకాలుగా పెంచుతారు.

1) ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అంటారు.

2) మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్‌ కుందేళ్లు అంటారు.

దీ మన దేశంలో హిల్‌ మరియు చలి ప్రాంతాలు అయిన జమ్ము కాశ్మీర్‌ మరియు సిక్కిం తదితర ప్రాంతంలో అంగొరా కుందేళ్లను పెంచుతున్నారు. 

దీ అంగోరా జాతి కుందేళ్లకు ఉదాహరణ బ్రిటీష్‌ అంగోరా, జెర్మన్‌ అంగోరా, రష్యన్‌ అంగోరా మొదలగునవి.

దీ ఈ కుందేళ్ల పెంపకం వల్ల మాంసంతో పాటు చర్మంతో గార్మెంట్స్‌, బొమ్మలు తదితర వస్తువులు తయారు కాగా ఉన్నితో బట్టలు, కార్పెట్లు మొదలగునవి తయారు చేస్తున్నారు.

దీ బ్రాయిలర్‌ కుందేళ్ల జాతులకు ఉదాహరణ న్యూజిలాండ్‌ వైట్‌, సోవియట్‌ చించిల్లా, ఫ్లెమిష్‌ జైంట్‌, గ్రేజైంట్‌ మరియు కాలిఫోర్నియన్‌ వైట్‌ జాతికి చెందిన కుందేళ్లు మన వాతావరణంలో పెంచుకోవడానికి అనువైనవి.

గృహ వసతి

దీ కుందేళ్ల షెడ్‌ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టవలెను.

దీ షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను.

దీ షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను.

దీ షెడ్‌ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దం ఎక్కువగా ఉన్నట్లయితే కుందేళ్లు భయపడటమే కాకుండా ఒత్తిడికి గురి అవుతూ ఉత్పాదక సామర్ధ్యం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి షెడ్‌ను నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దీ షెడ్‌ను ప్రతిరోజు శుభ్రంగా కడగాలి. మలమూత్రాలను తీసివేయాలి. మరియు తేమ బూజులు లేకుండా జాగ్రత్త వహించాలి.

కుందేళ్లను రెండు పద్ధతులలో పెంచుతారు.

1) డీప్‌ లిట్టర్‌ పద్ధతి; 2) కేజ్‌ పద్ధతి

డీప్‌ లిట్టర్‌ పద్ధతి: 

దీ ఈ పద్ధతిలో కుందేళ్లను లిట్టరుపై పెంచుతారు.

దీ ఈ పద్ధతిలో కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.

దీ ఈ పద్ధతిలో యుక్త వయసు వచ్చిన తరువాత ఒకదానితో మరొకటి పొట్లాడుకుంటాయి. మరియు పరాన్నజీవుల బారినపడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతి అంత మంచిది కాదు.

కేజ్‌ పద్ధతి:

దీ ప్రతి ఆడ కుందేలుకు 2.5 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు మరియు 1.5 అడుగుల ఎత్తు గల కేజ్‌లు అవసరం.

దీ ప్రతి మగ కుందేలుకు 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు మరియు 1.5 అడుగుల ఎత్తు గల కేజ్‌లు అవసరం.

దీ ఈ కేజ్‌లను కాలిఫోర్నియన్‌ టైప్‌గా అమర్చినట్లయితే తక్కువ స్థలంలో ఎక్కువ కుందేళ్లను పెంచవచ్చు. ఈ పద్ధతి కుందేళ్ళ పెంపకానికి ఎంతో అనువైనది.

దీ కేజ్‌లను భూమి నుండి 2 అడుగుల ఎత్తులో ఉండునట్లు చూడవలెను.

దీ కుందేళ్ల కేజ్‌లలో అమర్చిన నీటి మరియు దాణా తొట్లను ప్రతి రోజు శుభ్రం చేయాలి.

దీ కుందేళ్ల కేజ్‌లను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేయవలెను. దీనికి బదులు కొందరు కర్రలతో కేజ్‌లను తయారు చేసెదరు. కానీ అట్టి వాటిని పరిశుభ్రం చేయుట కష్టం. ఎప్పుడైనా జబ్బు వచ్చినప్పుడు కేజ్‌లను బ్లో లాంపుతో కాల్చవలెను. కర్రలతో చేసిన ఎడల వాటిని కాల్చడం వీలుకాదు.

దీ అడుగు భాగమున 1/2” þ 1/2” సైజు వెల్డుమెష్‌ను తప్పనిసరిగా వాడవలెను. లేనిచో పుట్టిన పిల్లల సందుల నుండి జారి క్రింద పడిపోవుటకు ఆస్కారము ఉన్నది.

దీ ఒక్కొక్క కేజిలో ఒక ఎదిగిన ఆడ కుందేలు లేదా ఒక ఎదిగిన మగ కుందేలు పెంచవచ్చు. ఒకే కేజ్‌లో 3-4 పెరిగే పిల్లలు 4 మాసములు వయస్సు వరకు పెంచవచ్చు. 4 మాసముల తరువాత వీటిని విడిగా ఒక్కొక్క కేజ్‌లో వేయాలి.

దీ ఒక్కొక్కప్పుడు మగ కుందేళ్లు 3 మాసములు తరువాత పొట్లాడుకొనును. అట్టి పరిస్థితిలో వాటిని వేరు చేయాలి.

కుందేళ్ల పిల్లల యాజమాన్యం

దీ    బన్నీల బరువు పుట్టినపుడు 40-50 గ్రా. మరియు పాలు మరచే సమయానికి సుమారు 300 నుండి 350 గ్రా. ఉంటాయి.

దీ ఆడ కుందేలు రోజుకు ఒకసారి నెస్ట్‌ బాక్స్‌లోకి వెళ్లి పిల్లలకు పాలనిస్తుంది.

దీ పిల్లలు త్రాగిన ప్రతి 2 గ్రా. పాలకు 1 గ్రా. బరువు పెరుగుతాయి.

దీ కుందేళ్ల పిల్లలు కళ్లు తెరవడానికి 14 రోజుల సమయం పడుతుంది.

దీ ప్రతి రోజు తల్లి కుందేలు పిల్లలకు పాలు ఇస్తుందో లేదో గమనించాలి.

కుందేళ్ల పోషణ

దీ సాధారణంగా పుట్టినప్పటి నుండి 12 రోజుల తరువాత పిల్లలు ఆహారం తినడం మొదలు పెడతాయి.

దీ కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. ఆహారంలో పీచు పదార్థం శాతం తగ్గినట్లయితే జీర్ణవ్యవస్థ పాడవుతుంది. కొన్నిసార్లు కుందేళ్ళు పారుకోవడం జరుగుతుంది. కాబట్టి కుందేళ్ళకు ఇచ్చే ఆహారంలో 14% పీచు పదార్థాలు ఉండేలా చూడాలి.

దీ కుందేళ్లను ‘హెర్బిదొరస్‌’ (శాకాహారిగా) పరిగణించాలి. పశువుల్లో లాగా నెమరు వేసే జంతువులా కాకుండా కుందేలు ఒకే పొట్టతో ఉంటుంది. 

దీ కుందేళ్లకు ఇచ్చే దాణాలో పలు పోషక పదార్థాలుండాలి. మాంసకృత్తులు 15-17 శాతం ఉండునట్లు చూసుకోవాలి. పిండిపదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు సమపాళ్లలో ఉండాలి.

దీ కుందేళ్లకు ఇచ్చే దాణాలో ఏ విధమైన విష పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి.

దీ సాధారణంగా తమ తమ ప్రాంతాల్లో లభ్యమయ్యే దాణా దినుసులను ధరలను బట్టి పాళ్లను నిర్ణయించుకొని దాణా తయారు చేసుకోవచ్చు.

దీ ఉదాహరణకు 100 కిలోల దాణా మిశ్రమమును ఈ విధముగా తయారు చేసుకోవచ్చు.

దాణా పదార్థాలు పరిమాణం (పాళ్లు)

మొక్కజొన్న గింజలు/జొన్నలు/నూకలు 50 కిలోలు

వేరుశనగ చెక్క / సోయాబీన్‌ చెక్క 22 కిలోలు

గోధుమ తవుడు / వరితవుడు 25 కిలోలు

ఖనిజ లవణ మిశ్రమం 2 కిలోలు

ఉప్పు 1 కిలో

మొత్తం 100 కిలోలు

దీ ప్రతి కుందేలుకు సుమారు 1 లీటరు త్రాగు నీటిని 200-300 గ్రా. దాణా, 200 గ్రా. పచ్చిమేత అవసరము.

దీ కుందేళ్ల పరిశ్రమ లాభదాయకంగా ఉండాలుంటే, అవి ఆరోగ్యంగా ఎదగాలి అంటే పుష్టికరమైన పచ్చి మేత పెట్టవలెను.

దీ రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి మేత పెట్టవలెను.

దీ రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి ఇచ్చినచో మేతపై అగు ఖర్చు తగ్గుతుంది. 

దీ కుందేళ్లకు పప్పుజాతి పశుగ్రాసాలైన లూసర్న్‌, బర్సీమ్‌ తప్పకుండా ఇవ్వవలెను.

కుందేళ్లలో పునరుత్పత్తి

దీ సుమారు 6 నెలల వయస్సులో కుందేళ్ళు సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి.

దీ ఐదు నుండి ఆరు ఆడ కుందేళ్లను దాటించడానికి ఒక మగ కుందేలు సరిపోతుంది.

దీ జత కట్టించడానికి ముందు కుందేళ్లకు తగినంత ఆహారం అందేటట్లు చూడాలి.

దీ మగ కుందేలు కేజ్‌లో ఆడ కుందేలును ఉంచి జత కట్టించాలి.

దీ వారానికి 3-4 సార్లు మగ కుందేలుతో క్రాసింగ్‌ చేయించాలి.

దీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విత్తనపు మగ కుందేలు మరియు ఆడ కుందేళ్లను వేరే ఫారాల నుండి తెచ్చినట్లయితే పుట్టే పిల్లలో మరణాల శాతాన్ని తగ్గించడమే కాకుండా ఎదుగుదల బాగా ఉంటుంది.

దీ వేసవిలో ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాటిస్తే మగ కుందేలు వీర్యోత్పత్తి తాత్కాలికంగా తగ్గిపోతుంది. కావున ఏప్రిల్‌ మరియు మే నెలలో జతకట్టించకూడదు.

దీ ఆడ కుందేలు నిర్దిష్టమైన ఎదలక్షణములు చూపదు, కానీ అది ఎదలో ఉన్నది లేనిది తెలుసుకొనుట కష్టము, జాగ్రత్తగా పరిశీలించినటచో ఆడ కుందేలు మానము ఎర్రగా తేమగా ఉండును.

దీ ఆడ కుందేలు ఎదలో ఉన్నచో వెంటనే మగ కుందేలును దాటుటకు అనువుగా కూర్చొనును. ఒకవేళ ఎదలో లేనిచో కేజ్‌లో పరుగెత్తుచుండును. లేదా తోక ముడుచుకొని ఒక మూలన కూర్చొనును.

దీ ఆడ కుందేలు జత కలిసిన రోజు నుండి 30-31 రోజుల్లో ఈనుతుంది.

దీ ఆడ కుందేలు ఈనిన రోజు కూడా దాటించుటకు సిద్ధమైయుండును. కానీ వెంటనే దాటించరాదు, ఎందుకనగా దాని గర్భం తిరిగి మామూలు స్థితికి వచ్చుటకు 15 రోజులు పట్టును. మరియు దాటించిన వెంటనే పాలు రాకుండటచేత పుట్టిన పిల్లలు పాలు దొరకక చనిపోవును. కావున ఆడ కుందేళ్లు ఈనిన నెల తర్వాత బన్నిలను వేరుచేసి మగకుందేళ్లతో జత కట్టించాలి.

దీ ఆడ కుందేళ్లు ఈనే 3 రోజుల ముందు చెక్కతో తయారు చేసిన నెస్ట్‌ బాక్సులను కేజ్‌లలో అమర్చాలి.

దీ చూడి నిర్ధారణ, ఆడ కుందేలును జత కట్టించిన 14 రోజుల తర్వాత చేయవచ్చు.

దీ ఆడ కుందేళ్లు ఈనడానికి ముందు తన చర్మంపై ఉన్న ఉన్నిని లాక్కొని నెస్ట్‌ బాక్స్‌ యందు ఉంచును.

దీ ఆడ కుందేలు ఎక్కువగా రాత్రులు లేక తెల్లవారుఝామున ఈనుతాయి.

దీ ఆడ కుందేలు ఈనుటకు ముందు దాణా, మేత తక్కువగా తినును.

దీ ఆడ కుందేలుకు సరిపోను నీరు అందుబాటులో ఉండునట్లు చేసుకోవాలి.

దీ ఆడ కుందేలును కదిలించుట మరియు బెదరకొట్టుట మంచిది కాదు.

దీ ఒక్కొక్క ఈతలో 4 నుండి 10 బన్నిలను కంటాయి.

దీ మాయ ఒక రక్తపు ముద్దలా పడును, దానిని వెంటనే తీసివేయాలి. మరియు దానిని తినకుండా ఉండునట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దీ ఈనిన తరువాత చనిపోయిన పిల్లలను తీసివేయవలెను.

దీ ఒక్కొక్కప్పుడు తల్లి పిల్లలను కేజ్‌లోనే ఈనుతాయి. అటువంటి పరిస్థితిలో వాటిని వెంటనే తీసి నెస్టు బాక్సులో పెట్టవలెను. ఈనునప్పుడు ఎక్కువమంది ఉన్న, కుక్కలు, పిల్లులు, ఎలుకలు ఉన్నచో అది భయపడి పిల్లలను త్రొక్కుట వలన పిల్లలు చనిపోవును. కావున అది ఈనునపుడు చాలా జాగ్రత్తగా ఉండవలెను.

మాంసోత్పత్తి

దీ ప్రతి కుందేలు 12 నుండి 16 వారాల వయసులో సుమారు 2 కిలోల బరువు తూగి, 1 కిలో మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది.

దీ కుందేలు మాంసం తెల్లగా, రుచిగా మరియు మృదువుగా ఉంటుంది.

దీ ఒక్కొక్క బన్ని 2 కిలోల బరువు పెరిగేవరకు, ప్రతి కిలో బరువు పెరుగుదలకు సుమారు 3కిలోల దాణా అవసరం ఉంటుంది.

దీ తమ దేహ బరువులో సుమారు 55 శాతం వండుకోవడానికి వీలైన మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి.

డా. సి.హెచ్‌. శివప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, పశుగణ క్షేత్ర సముదాయము, పశువైద్య కళాశాల, కోరుట్ల